న్యూఢిల్లీ, మార్చి 1: భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా మరో కీలక ముందడుగు పడింది. రూ.39,125 కోట్ల విలువైన ఐదు ప్రధాన రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది. వివిధ సంస్థలు బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుతో సహా రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్-29 జెట్ల ఏరో ఇంజిన్లను సరఫరా చేయనున్నాయి.
వీటిలో రూ.19,518 కోట్ల ఒప్పందంలో భాగంగా బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులను బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్) రక్షణ శాఖకు అందించనున్నది. చైనా, పాకిస్థాన్తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలునేపథ్యంలో రక్షణ రంగంలో ఈ ఒప్పందాలు జరగడం గమనార్హం.