TV Channels | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కెనడాతో దౌత్యపరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు పరారైన ఖలిస్థాన్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల గళం విన్పించకుండా చేయడానికి తన చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్ర నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, నిషేధిత సంస్థల తరఫున వచ్చే వారికి తమ వేదికల మీద స్థానం కల్పించి చర్చా కార్యక్రమాలు నిర్వహించ వద్దని కేంద్రం గురువారం టీవీ చానల్స్కు విజ్ఞప్తి చేసింది.
పలు నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండి భారత్లో నిషేధానికి గురైన ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక వ్యక్తితో చర్చలకు ఒక టెలివిజన్ ఆహ్వానం పంపినట్టు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది.