మోగ (పంజాబ్): కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి కడుపులోని వస్తువులను చూసి షాక్ తిన్నారు. ఇయర్ ఫోన్లు, స్క్రూలు, లాకెట్లు, రాఖీలు, వాషర్లు, నట్లు, బోల్టులు, రేపర్లు, హెయిర్ క్లిప్పులు, జిప్పర్ టేగ్, సేఫ్టీ పిన్లు ఇలా వందలాది లోహపు వస్తువులతో అతడి కడుపు నిండుగా కన్పించింది.
దీంతో ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన పంజాబ్లోని మోగలోని మెడిసిటీ దవాఖానలో చోటుచేసుకుంది. పంజాబ్కు చెందిన 40 ఏండ్ల ఒక వ్యక్తి జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ దవాఖానలో చేరాడు. అతని కడుపును ఎక్స్రే తీసిన డాక్టర్లు.. అందులో కనిపించిన వస్తువులను చూసి విస్మయం చెందారు