న్యూఢిల్లీ, జూన్ 22: ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై దాడుల కోసం అమెరికా యుద్ధ విమానాలు మన గగనతలాన్ని వినియోగించుకున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని, ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
భారత గగనతలాన్ని వాడుకునే అమెరికా విమానాలు ఇరాన్పై భీకర దాడికి పూనుకున్నాయంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ప్రచారం జరిగింది. దీనిని సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖలోని పీఐబీ ఖండించింది.