బెంగళూరు, జూలై 6: డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంతోపాటు, ఇతర నగరాల్లో ఉన్న సంస్థ ప్రమోటర్లు, డిస్టిబ్యూటర్ల కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ సంస్థ రికార్డుస్థాయిలో 350 కోట్ల ట్యాబ్లెట్లను విక్రయించింది. ఒకే ఏడాదిలోనే దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.