లుథియానా: ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ లుథియానాలో ఉన్న ప్రముఖ జ్యువెలరి షాపుల్లో సోదాలు నిర్వహించారు. నిక్కమ్మల్ జ్వలర్స్, సర్దార్ జ్వలర్స్, మణి రాజమ్ బల్వంత్ రాయ్ జ్యువెలరి షాపుల్లో ఐటీశాఖ ఆఫీసర్లు తనిఖీలు చేపడుతున్నారు. షోరూమ్లతో పాటు ఇండ్లల్లోనూ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల సహకారంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఐటీశాఖ సోదాలు జరుగుతున్నట్లు తెలియగానే నగరంలో భయాందోళనలు మొదలయ్యాయి. అనేక షోరూమ్లను తెరవలేదు. మొబైల్ ఫోన్లను కూడా స్విచాఫ్ చేశారు.