న్యూఢిల్లీ, మే 18: బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై పట్నా హైకోర్టు విధించిన స్టేను ఎత్తేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేస్తూ మే 4న పట్నా హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. పట్నా హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. జూలై 3న పట్నా హైకోర్టు ముందే వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏదైనా కారణంతో హైకోర్టులో విచారణ జరగకపోతే జూలై 14న తాము విచారణ జరుపుతామని పేర్కొన్నది.