Jharkhand: జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన రాజీనామా చేయడం, జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్ సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, పది రోజుల్లోగా అసెంబ్లీ బలం నిరూపించుకోవాలని ఆయనను గవర్నర్ ఆదేశించడం రెండు రోజుల్లో చకచకా జరిగాయి.
తాజాగా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం జార్ఖండ్ ప్రభుత్వ నూతన క్యాబినెట్ తొలిసారి సమావేశమైంది. సీఎం చంపాయ్ సోరెన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 5, 6 తేదీల్లో అసెంబ్లీని సమావేశపర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చంపాయ్ సోరెన్ బలపరీక్ష నెగ్గాల్సి ఉంటుంది. బలపరీక్ష నేపథ్యంలో చేజారిపోకుండా జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను తెలంగాణ రాజధాని హైదరాబాద్కు తరలించారు.