న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం బ్యానర్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉంచారు. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మెగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం తలపెట్టింది. అసోలా వన్యప్రాణుల అభయారణ్యంలో భారీగా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కార్యక్రమం వేదిక వద్ద ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్లను ఢిల్లీ పోలీసులు తొలగించారు. వేదిక ప్రాంగణంలో, వేదికపైనా ఢిల్లీ ఎల్జీ, సీఎం కేజ్రీవాల్తోపాటు ప్రధాని మోదీ ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేశారు. అలాగే వాటికి రక్షణగా భారీగా పోలీసులను మోహరించారు.
కాగా, కేంద్రం పరిధిలోని ఢిల్లీ పోలీసుల చర్యపై ఆప్ ప్రభుత్వం మండిపడింది. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమ బ్యానర్లను తొలగించి పిల్లల స్థానంలో ప్రధాని మోదీ ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టింది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు వ్యవహరించారని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ విమర్శించారు. తమ ప్రభుత్వ కార్యక్రమాన్ని మోదీ హైజాక్ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు తాను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదన్నారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్లను ఢిల్లీ పోలీసులు తొలగించి వాటి స్థానంలో మోదీ ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేసిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
Shameful politicisation of Delhi govt.'s massive tree plantation event by PMO
➡️Police personnel sent by PMO to hijack the stage
➡️Video for awareness for children replaced by a banner with PM's photo
What is Delhi govt.'s tree plantation event to do with PM?
—@AapKaGopalRai pic.twitter.com/QKeQiBEa7N
— AAP (@AamAadmiParty) July 24, 2022
Delhi Govt के वन महोत्सव में CM @ArvindKejriwal को शामिल होना था
लेकिन प्रधानमंत्री कार्यलय के आदेश पर Police ने मंच पर कब्ज़ा कर ज़बरदस्ती Modi जी की तस्वीर लगा दी और हटाने पर गिरफ़्तारी की धमकी दी
मोदी जी दिल्ली Govt के कायर्क्रम में अपनी तस्वीर लगाकर क्या साबित करना चाहते? pic.twitter.com/B3Hdo5KCLr
— AAP (@AamAadmiParty) July 24, 2022