జైపూర్: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై, బీజేపీ మాజీ నేత పోటీకి దిగారు. రాజస్థాన్లోని కోటా లోక్సభ స్థానం నుంచి ప్రహ్లాద్ గుంజాల్ ఆయనపై తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించింది. (Om Birla Vs Prahlad Gunjal In Kota) రెండు రోజుల కిందటే బీజేపీని వీడిన ప్రహ్లాద్ గుంజాల్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు.
కాగా, ప్రహ్లాద్ గుంజాల్, కోటా నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరుఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఏడాది జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచి ఓడిపోయారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజేకు చాలా సన్నిహితుడైన ప్రహ్లాద్ గుంజాల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. హదోతి ప్రాంతంలో కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నది.
మరోవైపు లోక్సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఒకరిని ఆ పార్టీ ప్రకటించింది. రాజస్థాన్లో అజ్మీర్ లోక్సభ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి దామోదర్ గుర్జార్, కోటా నియోజకవర్గంలో ప్రహ్లాద్ గుంజాల్ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి అయిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఆయన తలపడనున్నారు.