రాయపూర్: సోదరుడికి రాఖీ కట్టి తిరిగి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక లైంగిక దాడి జరిగింది. (sisters gang raped) బీజేపీ నేత కుమారుడితో సహా పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు సోదరీమణుల్లో ఒకరికి కాబోయే భర్తతో కలిసి రక్షాబంధన్ వేడుక తర్వాత బైక్పై తిరిగి వెళ్తున్నారు.
కాగా, తొలుత ముగ్గురు వ్యక్తులు మార్గమధ్యలో వారిని అడ్డుకున్నారు. అక్కాచెల్లెళ్లు, వారి వెంట ఉన్న వ్యక్తిని బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్లు దోచుకున్నారు. ఇంతలో మరో ఏడుగురు నాలుగు బైకులపై అక్కడకు చేరుకున్నారు. అక్కాచెల్లెళ్లను రోడ్డు పక్కన ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి వెంట ఉన్న వ్యక్తిని దారుణంగా కొట్టారు.
మరోవైపు, బాధిత అక్కాచెల్లెళ్ల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. నేర చరిత్ర ఉన్న పది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుల్లో ఒకడైన పూనమ్ ఠాకూర్ స్థానిక బీజేపీ నేత లక్ష్మీ నారాయణ్ సింగ్ కుమారుడని పోలీసులు తెలిపారు. అతడిపై పలు కేసులు నమోదయ్యాయని, ఆగస్ట్ నెలలో బెయిల్పై విడుదలైనట్లు చెప్పారు.