న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం అరెస్ట్ చేసింది (CBI arrests ). రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారుల అవినీతి, అక్రమాలు, లంచంగా మూడు లక్షలు తీసుకోవడంపై కొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి సీబీఐకి ఫిర్యాదులు అందాయి. వీటిపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు అధికారులతో సహా నలుగురిని అరెస్టు చేశారు.
ఢిల్లీలోని ఆ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రస్తుతం చెన్నైలోని కార్పొరేట్ భవన్లో అఫీషియల్ లిక్విడేటర్గా ఉన్న ఆ మంత్రిత్వ శాఖకు చెందిన మరో జాయింట్ డైరెక్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ముంబైకి చెందిన ప్రైవేట్ కంపెనీ అలోక్ ఇండస్ట్రీస్కు చెందిన ఒకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు వ్యక్తుల అరెస్ట్ సందర్భంగా రూ.60 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.