ముంబై : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజా ఇన్స్టాగ్రాం పోస్ట్తో నెట్టింట సందడి చేశారు. రాజస్ధాన్ రాజధాని జైపూర్ను సందర్శించిన సచిన్ అక్కడి సంప్రదాయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. సచిన్ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ షార్ట్ క్లిప్లో సచిన్ భారీ ప్లేట్లో ఉన్న రాజస్ధానీ సంప్రదాయ వంటకాలను చూపించాడు. మాస్టర్ బ్లాస్టర్ గ్లాస్లో ఉన్న లస్సీని సిప్ చేస్తూ కనిపించారు. బ్యాక్గ్రౌండ్లో నెమళ్ల శబ్ధాలు వినిపించాయి. జైపూర్లో ఉంటే జైపూరియన్ల తరహాలో బ్రేక్ఫాస్ట్ను ఆస్వాదించాలి..నా ప్లేట్లో ఏమేం ఉన్నాయో చూడండి..లస్సీ కూడా ఉంది..ఎంజాయ్ అని ఆ క్లిప్లో సచిన్ చెప్పుకొచ్చారు.
బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరంగా ఉంది..తాను ఆరగిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో నెమళ్ల శబ్ధాలు లయబద్ధంగా వినిపిస్తున్నాయి..వినండి! అని పోస్ట్కు క్యాప్షన్గా ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 లక్షల మంది వీక్షించారు. ఇక నెటిజన్లు సచిన్ బ్రేక్ఫాస్ట్ నోరూరించేలా ఉందని కామెంట్ చేశారు. ఈ వయసులో మీరు ఇంతటి ఫిట్నెస్, డైట్ను ఎలా మెయింటెయిన్ చేస్తున్నారని ఓ యూజర్ పేర్కొనగా, ఫుడ్ బ్లాగర్లు అందరూ ఇక మరో ఉద్యోగం చూసుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.