న్యూఢిల్లీ : ఫుడ్ బ్లాగర్లు రకరకాల కాంబినేషన్స్తో నెట్టింట చెలరేగుతున్నారు. హాట్ డిష్లంటూ తోచిన రీతిలో ఆహార పదార్ధాలను మిక్స్ చేసి కొత్త డిష్గా హోరెత్తిస్తున్నారు. వీరి వంటకాలను కొందరు క్రేజీ కాంబినేషన్ అని లొట్టలేస్తుంటే ఇలాంటి చెత్త డిష్లు ట్రై చేయకండని పలువురు నెటిజన్లు చిర్రెత్తుతున్నారు.
తాజాగా ఓ ఫుడ్ బ్లాగర్ అంజనీ ధింగ్రా వెరైటీ కాంబినేషన్ అంటూ నూడుల్స్ను స్టఫ్ చేసిన ప్లెయిన్ దోశ డిష్ను ఇన్స్టాగ్రాంలో పరిచయం చేసింది. కొరియన్ ఫ్యూజన్ దోశ క్యాప్షన్తో ఇన్స్టాలో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా వీక్షించారు.
పాన్పై దోశ పిండిని వేసిన అంజలి ఆపై కొరియన్ నూడుల్స్ను కుక్ చేసి వాటిని దోశలో స్టఫ్ చేశారు. ఆపై దాన్ని టేస్ట్ చేస్తూ వీడియోలో కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దోశ సరిగ్గా రాలేదని..లోపల పిండి కనిపిస్తోందని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియోను ఇప్పటికైనా డిలీట్ చేయడం తొందరపాటు కాదని మరో యూజర్ మండిపడ్డారు.