భోపాల్ : పండగ జోష్లో డీజే కారు టాప్పైకి ఎక్కి నృత్యాలు చేస్తున్న వారు విద్యుత్ షాక్కు గురైన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులందరూ డీజే కారు టాప్పైకి ఎక్కి డ్యాన్సులు చేస్తున్నారు.
ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తికి హైటెన్షన్ వైరు తగలడంతో ఒకరి తర్వాత ఒకరు విద్యుత్ షాక్కు గురై వాహనం నుంచి కిందపడిపోయారు. ఒక వ్యక్తి ఘటనా స్ధలంలోనే మరణించగా మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉందని బాధితులందరూ ఇండోర్లోని మహరాజ యశ్వంత్రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు మధ్యప్రదేశ్లోని డాక్టర్ అంబేద్కర్నగర్లో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్పీ భగ్వంత్ సింగ్ చెప్పారు.