న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, పారిశుధ్య కార్మికులకు, ఫ్రంట్లైన్ కార్మికులను ఆహ్వానించారు. ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు సంబంధించి సిద్ధం చేసిన ఆహ్వానాల జాబితాలో కార్మికులున్నారు. వీరంతా రాజ్పథ్లో జరిగే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వేడుకల రోజు వివిధ వర్గాల ప్రజల కోసం సీట్లు కేటాయించనున్నారు. అయితే, ప్రస్తుత కొవిడ్ పరిస్థితి కారణంగా కేవలం 5వేల నుంచి 8వేల మంది మాత్రమే వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు విదేశీ ముఖ్య అతిథులు వస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పేర్కొన్నారు.