చెన్నై: దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. డిసెంబర్ 17వ తేదీ నుంచి వానలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లోనూ విస్తృతంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ(IMD Warning) పేర్కొన్నది. విరుధునగర్, మధురై, తేని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి జిల్లాలో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి.
తిరునెల్వేలిలోని తమిరబరని నది ఉప్పొంగుతున్నది. అదనపు నీరును కన్నడియన్ ఛానల్కు విడుదల చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాలకు మంత్రులను పంపారు. మధురైలోని వైగేయి నదిలో క్రమక్రమంగా నీటి స్థాయి పెరుగుతున్నది.
సోమవారం రోజున వైగేయి డ్యామ్లోకి 17,391 క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. డ్యామ్ వద్ద నీటి మట్టం 66.67 అడుగులకు చేరుకున్నది. ఆ డ్యామ్ పూర్తి స్థాయి 71 ఫీట్లు. తేని, దిండిగుల్, మధురై, శివగంగా, రామనాథపురం జిల్లాలకు ఫ్లడ్ వార్నింగ్ జారీ చేశారు.
ఆదివారం రోజున తుఫాన్ వల్ల కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, టెంకాశీ జిల్లాలో భీకర స్థాయిలో వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు నమోదు అయ్యాయి. శనివారం రోజున దక్షిణ తమిళనాడు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వర్షాలు కురిశాయి. విరుధునగర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
#WATCH | On Tamil Nadu rains, S Balachandran, Director of Chennai Regional Meteorological Centre says, “For next 24 hours, ‘Red’ alert to continue for Tenkasi, Thoothukudi, Tiruvaneli and Kanyakumari districts….” pic.twitter.com/FOzyw5bviz
— ANI (@ANI) December 18, 2023