న్యూఢిల్లీ, జూన్ 11: వ్యవసాయంలో పురుగు మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని స్థిరంగా మార్చగలిగే పర్యావరణ హిత మైక్రోజెల్స్ను ఐఐటీ మండి శాస్త్రవేత్తలు తయారుచేశారు. రసాయనాలు అధికంగా వినియోగించడం వల్ల పెట్టుబడి పెరుగుతుందని, భూగర్భ జలాలు, మట్టి, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఐఐటీ మండి అసిస్టెంట్ ప్రొఫెసర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు మైక్రోజెల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. వీటిని స్మార్ట్ డెలివరీ సిస్టమ్గా వినియోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు.