చెన్నై, జూలై 6: క్యాన్సర్ కారక జన్యువులను ముందుగానే గుర్తించే ఏఐ టూల్ను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీన్ని పివోట్గా పిలుస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఇది కీలకంగా మారుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఫ్రాంటియర్ ఇన్ జెనెటిక్స్ జర్నల్లో పరిశోధన వివరాలు ప్రచురించారు.