ఖరగ్పూర్, డిసెంబర్ 25: పశ్చిమబెంగాల్లోని ఐఐటీ-ఖరగ్పూర్ అంతర్జాతీయంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మలేసియాలో ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాలని నిర్ణయించింది. శనివారం ఖరగ్పూర్ ఐఐటీ 68వ స్నాతకోత్సవం సందర్భంగా డైరెక్టర్ వీకే తివారీ ఈ విషయాన్ని వెల్లడించారు.
అత్యుత్తమ విద్యా ప్రమాణాల విషయంలో తమ ఐఐటీని ప్రపంచంలో టాప్ టెన్ సంస్థగా నిలపాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే మలేసియాలో తమ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, వినోద్ గుప్తా లాంటి వేలాది మంది తమ ఐఐటీ నుంచి బయటకు వచ్చినవారేనని పేర్కొన్నారు.