గువాహటి: సముద్రంలో చమురు ఒలికిపోవడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఓ వస్ర్తాన్ని అభివృద్ధిపరచినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – గువాహటి పరిశోధకులు తెలిపారు. ఈ ఫ్యాబ్రిక్ నీటిని, చమురును వేరు చేయగలదని చెప్పారు.
కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వైభవ్ గౌడ్ మాట్లాడుతూ, ధాన్యం పొట్టును ప్రధానంగా ఉపయోగించి, సిలికా నానోపార్టికిల్స్ కోటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ను అభివృద్ధిపరిచామని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను సముద్ర చమురు కాలుష్య నివారణకు ఉపయోగపడేలా చేశామన్నారు.