వారణాసి: ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ ప్రాంగ ణంలో దారుణం చోటుచేసుకొంది. ముగ్గు రు వ్యక్తులు ఓ విద్యార్థినిని ఆమె ఉండే వసతి గృహం సమీపంలోనే వేధించి, దుస్తు లు తొలగించి వీడియో తీశారు. బాధితురాలి కథనం ప్రకారం బుధవారం రాత్రి ఆమె ఒక స్నేహితుడితో కలిసి హాస్టల్కు దగ్గరలో ఉన్న కర్మన్ బాబా దేవాలయానికి వెళ్లింది. అక్కడకు మోటార్ సైకిల్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఒక మూలకు తీసుకెళ్లి ఆమె దుస్తులు విప్పి ఫొటోలు, వీడియో తీశారు. ఫోన్ నెంబర్ తీసుకొని వదిలిపెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై గురువారం వందలాది మంది బీహెచ్యూ విద్యార్థులు ధర్నాచేశారు. బయటి వ్యక్తుల ను వర్సిటీ ప్రాంగణంలోకి రాకుండా నిషే ధించాలని డిమాండ్ చేశారు. ‘ఐఐటీ లాంటి ఉన్నత విద్యా సంస్థలు సురక్షితం కాదా? ప్రధాని నియోజకవర్గంలో ఒక విద్యార్థిని భయం లేకుండా సంచరించలేదా?’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.