రాయ్పుర్ : ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ రైల్వేస్టేషన్లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సీఆర్పీఎఫ్ ప్రత్యేక రైలులో ఇగ్నైటర్ బాక్స్ కిందపడి పేలిపోయింది. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.