న్యూఢిల్లీ : గోధుమలు కిలో కేవలం రూ 1.6గా ఉన్నట్టు చూపుతున్న పాత బిల్లు ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇది ఎఫ్సీఐకి తన తాత అమ్మిన పంటకు సంబంధించిన జే ఫామ్ రసీదని కస్వన్ పేర్కొన్నారు. తన తాత జే ఫాంను కస్వన్ జనవరి 2న ట్విట్టర్లో షేర్ చేశారు.
రైతులు గ్రెయిన్ మార్కెట్లో వ్యవసాయ దిగుబడి విక్రయించగా అమ్మక రసీదుగా జే ఫాంను పరిగణిస్తారు. 1987 నాటి బిల్లులో గోధుమ ధర కిలోకు రూ .1.6గా చూపుతోంది. కిలోకు రూ . 1.6 పలికిన రోజుల్లో తన తాత గోధుమ పంటను ఎఫ్సీఐకి విక్రయించారు అని ఈ పోస్ట్కు కస్వన్ క్యాప్షన్ ఇచ్చారు. తన తాత రికార్డులను భద్రపరిచేవారని, ఈ డాక్యుమెంట్ను జే ఫామ్గా పిలిచేవారని మరో ట్వీట్లో కస్వన్ పేర్కొన్నారు.
40 ఏండ్లుగా పంటల అమ్మకానికి సంబంధించిన పత్రాలన్నీ ఆయన వద్ద భద్రంగా ఉన్నాయని..వీటిపై ఎంచక్కా ఇంటి వద్దే ఎవరైనా అధ్యయనం చేయవచ్చని కస్వన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. అప్పటి బిల్లును పోస్ట్ చేయడం అధ్భుతమని ఓ యూజర్ పేర్కొనగా, అప్పట్లో పెద్దవారు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్క రాసేవారని మరో యూజర్ కామెంట్ చేశారు.