అయోధ్య: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తలను నరికి తెచ్చినవారికి 10 కోట్లు ఇస్తానని అయోధ్యలోని జగద్గురు పరమహంస ఆచార్య(Ayodhya Seer Paramhans Acharya) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను ఆయన మళ్లీ సమర్ధించుకున్నారు. పది కోట్లు చాలకుంటే.. రివార్డును పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ తల నరకడానికి 10 కోట్లు సరిపోవనుకుంటే, అప్పుడు ఆ రివార్డును పెంచనున్నట్లు పరమహంస ఆచార్య వెల్లడించారు. కానీ సనాతన ధర్మంపై పట్ల అవమానాన్ని సహించబోనన్నారు.
ఈ దేశంలో జరిగిన అభివృద్ధికి సనాతన ధర్మమే కారణమన్నారు. ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలన్నారు. దేశంలోని వంద కోట్ల మంది ప్రజల మనోభావాలను ఆయన కించపరిచినట్లు ఆచార్య తెలిపారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన మంత్రి ఉదయనిధి.. ఆ ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.