న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ(10వ తరగతి), ఐఎస్సీ(12వ తరగతి) పరీక్షల డేట్షీట్లను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) సోమవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపింది.
భారత్తో పాటు థాయ్లాండ్, సింగపూర్, ఇండోనేషియా, యూఏఈలో 2,803 పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఐఎస్సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతాయని తెలిపింది. భారత్తో పాటు యూఏఈ, సింగపూర్లో 1,461 పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.