Diabetes Biobank | న్యూఢిల్లీ: సైంటిఫిక్ పరిశోధనలను బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది. మద్రాసు డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్(ఎండీఆర్ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ బయోబ్యాంకు ఏర్పడింది.
బయోస్పెసిమెన్ల సేకరణ్, ప్రాసెస్ చేయడం, భద్రపరచడం, పంపిణీ చేయడం ఈ బయోబ్యాంకు లక్ష్యాలు. ఐసీఎంఆర్ అనుమతితో శాస్త్రీయ పరిశోధనలకు ఈ బయోబ్యాంకు తోడ్పాటును అందిస్తుంది. డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు, డయాబెటిస్లో భారతీయ రకాలకు చెందిన తేడాలు, సంబంధిత రుగ్మతలను బయోబ్యాంకు సాయంతో ఆధునిక పరిశోధనలు జరుగుతాయని ఎండీఆర్ఎఫ్ చైర్మన్, డాక్టర్ వీ మోహన్ తెలిపారు.