ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ లోన్ అవినీతి కేసులో కొచ్చర్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్లో పెట్టింది. చందాకొచ్చర్ ఐసీఐసీఐ సీఈవోగా ఉన్న సమయంలో వీడియోకాన్ కంపెనీకి దాదాపు 20 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణ మంజూరు సందర్భంగా చందాకొచ్చర్కు భారీగా డబ్బు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కూడా కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు చందాకొచ్చర్ను, ఆమె భర్త దీపక్ కొచ్చర్ను అరెస్ట్ చేసి విచారించారు. వారితోపాటు వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ను కూడా అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం నిందితులంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ క్రమంలో కొచ్చర్ దంపతులు తమ అరెస్టును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఈ కేసు నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పించాలని పిటిషన్లో కోరారు. వారి పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ నెల 9న తీర్పును వెల్లడించనున్నట్లు పేర్కొంది.