శ్రీనగర్: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరో మైలురాయి సాధించింది. 8,800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న జమ్ముకశ్మీర్లోని కార్గిల్ ఎయిర్స్ట్రిప్ (Kargil airstrip)పై రాత్రి వేళ సీ-130జే విమానాన్ని ల్యాండ్ చేసింది. ఒకవైపు దట్టంగా మంచుతో ఏమీ కనిపించని పరిస్థితి, మరోవైపు కొండ ప్రాంతాల వంటి సవాళ్లను ఐఏఎఫ్ పైలట్లు అదిగమించారు. సీ-130జే విమానాన్ని రాత్రి వేళ కార్గిల్ ఎయిర్స్ట్రిప్లో చరిత్రాత్మకంగా ల్యాండింగ్ చేశారు. ఈ మిషన్ ద్వారా ఈ ఘనత సాధించారు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున ఈ విన్యాసం నిర్వహించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావరణం, ఎత్తైన కొండ ప్రాంతాలు వంటి పరిస్థితుల్లో టెర్రైన్ మాస్కింగ్ టెక్నిక్ల ద్వారా ఐఏఎఫ్ సామర్థ్యాలను ప్రదర్శించినట్లు పేర్కొంది. కార్గిల్ ఎయిర్స్ట్రిప్లో నైట్ ల్యాండింగ్ మిషన్తో మరో మైలురాయిని సాధించినట్లు వెల్లడించింది. ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన సీ-130జే విమానం తొలిసారి కార్గిల్ ఎయిర్స్ట్రిప్లో రాత్రి పూట ల్యాండ్ అయ్యింది. గార్డ్స్కు శిక్షణ కూడా ఈ మిషన్ కూడుకున్నది’ అని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ మిషన్కు సంబంధించిన వీడియో క్లిప్ను ఐఏఎఫ్ షేర్ చేసింది.
In a first, an IAF C-130 J aircraft recently carried out a night landing at the Kargil airstrip. Employing terrain masking enroute, the exercise also dovetailed a training mission of the Garuds.#SakshamSashaktAtmanirbhar pic.twitter.com/MNwLzaQDz7
— Indian Air Force (@IAF_MCC) January 7, 2024