కోల్కతా: తాను ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 30న జరుగనున్న ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీపై భబానిపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక శనివారం సాయంత్రం కోల్కతాలోని కాలిఘాట్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇక్కడ జరిగిన అన్యాయాల నుండి ప్రజలను రక్షించాలని కాళికామాతను ప్రార్థించడానికి ఇక్కడకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రజలపై అన్యాయం, హింసను ప్రోత్సహిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగానే తన పోరాటమని అన్నారు. ఉప ఎన్నిక జరుగనున్న భబానిపూర్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని బీజేపీ అభ్యర్థి ప్రియాంక వెల్లడించారు.