Chirag Paswan: ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు కటీఫ్ చెప్పి బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన జేడీయూ చీఫ్ నితీశ్కుమార్.. ఇవాళ (ఆదివారం) బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్డీఏ తరఫున ఈ రాత్రికి మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి, మరో నేత విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణం చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో నితీశ్కుమార్ అంటే ఏమాత్రం గిట్టని లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్.. తాను ఇవాళ జరగబోయే నితీశ్కుమార్ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని చెప్పారు. ఎన్డీఏ మిత్రపక్ష పార్టీ అధ్యక్షుడిగా కార్యక్రమానికి హాజరవడం తన బాధ్యతని అన్నారు. బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుండటమనేది సంతోషకర సందర్భమని, బీహార్ ఫస్ట్, బీహారి ఫస్ట్ అనేది తమ విజన్ అని వ్యాఖ్యానించారు.
నితీశ్కుమార్ తనకు శత్రువేమీ కాదని, అయితే ఆయనతో తనకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని చిరాగ్ చెప్పారు. ఆయన విధానాలను అలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో కూడా ఆయనతో తనకు విధానపరమైన విభేదాలు కొనసాగుతాయన్నారు. ఎందుకంటే నితీశ్కుమార్ విధానాలు బీహార్ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం అక్కరకు రావనేది తన బలమైన అభిప్రాయమని పేర్కొన్నారు.