షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం పదవి ఎవరిని వరించబోతున్నదనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. పదవిని ఆశిస్తున్నవాళ్లు కూడా ఎక్కువ మందే ఉండటంతో.. ఎవరో ఒకరి పేరును ఖరారు చేయడం హైకమాండ్కు చిక్కు సమస్యగానే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం పదవి రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న హిమాచల్ పీసీసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తానెప్పుడూ సీఎం పదవి రేసులో లేనని, నిన్న లేను.. నేడు లేను.. ఇక ముందు కూడా ఉండబోనని సుఖ్విందర్ వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని, తానెప్పుడూ పార్టీకి కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. తానెన్నడూ సీఎం పదవిని ఆశించలేదన్నారు. తనకు పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని, అంతకుముందు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, కాబట్టి పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండటం తన కర్తవ్యమని సుఖు పేర్కొన్నారు.