న్యూఢిల్లీ, ఆగస్టు 6: తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో రూ. 200 కోట్లకు పైగా నల్లధనం గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. ప్రముఖ నిర్మాతలు కలైపులి ఎస్ థాను, అన్బు సెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ తదితరుల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి.