న్యూఢిల్లీ: పన్ను ఎగవేత కేసులో చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువాయి ఆఫీసులపై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగుళూరులో ఉన్న ఆఫీసుల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. కంపెనీకి చెందిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, అకౌంట్ పుస్తకాలు, కంపెనీ రికార్డులను ఐటీ అధికారులు పరిశీలించారు. భారతీయ వ్యాపారులు, ఓవర్సీస్ లావాదేవీలను ఐటీ తనిఖీ చేసింది. ఈ కేసులో కొన్ని పేపర్లను సీజ్ చేశారు. అయితే భారతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు హువాయి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది చైనాకు చెందిన జియోమి, ఒప్పొ కంపెనీలపై కూడా ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే.