సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. రాష్ట్రంలోని ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సతీమణి సాధనా ఠాకూర్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలు తమకు చాలాచాలా ప్రత్యేకమని సాధనా ఠాకూర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రిగా తన భర్త రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేశారని ఆమె తెలిపారు. తన భర్త హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినదని, అందుకే ఈ ఎన్నికల్లో విజయం తన భర్తనే వరించేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.