లక్నో: తనకు నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని బీజేపీ ఎంపీ రవికిషన్ తెలిపారు. జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాని కాంగ్రెస్దే ఆ తప్పని చెప్పారు. ఆ బిల్లు ఉంటే తనకు తక్కువగా పిల్లలు ఉండేవారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎంపీ అయిన రవికిషన్, ఒక వార్తా చానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. తాను నలుగురు పిల్లలను కనడానికి గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్దే తప్పని వాదించారు. ఆ పార్టీ జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాలేదని, దీని వల్లనే తనకు ఎక్కువ మంది సంతానం కలిగారని చెప్పారు. ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే తనకు తక్కువగా పిల్లలు ఉండేవారని అన్నారు.
‘మీకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు జనాభా నియంత్రణ బిల్లు కావాలని కోరుతున్నారు. దీనిపై మీరేమంటారు?’ అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఆయన వింతగా సమాధానం ఇచ్చారు. తాను నలుగురు పిల్లలను కనడానికి కాంగ్రెస్దే తప్పని వాదించారు. ‘నాకు నలుగురు పిల్లలున్నారు. ఇది నా తప్పు కాదు. కాంగ్రెస్ బిల్లు తెచ్చి చట్టం చేసి ఉంటే, మాకు నలుగురు పిల్లలు పుట్టేవారు కాదు’ అని అన్నారు. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుత జనాభా పెరుగుదలకు కారణమని ఆయన విమర్శించారు. ‘జనాభా విస్ఫోటనం గురించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నా. నాకు నలుగురు పిల్లలు ఉండటంపై పశ్చాత్తాపం చెందుతున్నా’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు జనాభాను చైనా నియంత్రించిందంటూ బీజేపీ ఎంపీ రవికిషన్ ఆ దేశాన్ని పొగిడారు. చైనా మాదిరిగా గత ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే తరతరాల వారికి కష్టాలు ఉండేవి కావన్నారు. దీనిపై చర్చించడం ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తుందని తెలిపారు. అయితే ఇలాంటి చట్టాల ఫలితం 20-25 ఏళ్ల తర్వాత ప్రబలంగా ఉంటుందని అన్నారు.
आपके चार बच्चे हैं और आप तीसरे बच्चे के पिता बनने जा रहे हैं? और आप जनसंख्या नियंत्रण बिल ला रहे हैं. क्या कहना चाहेंगे? सुनिए इस सवाल पर क्या बोले बीजेपी सांसद @ravikishann#PopulationControlBill #BJP | @chitraaum pic.twitter.com/e8iFTaFThI
— AajTak (@aajtak) December 9, 2022