న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పుపై సీఎం బీఎస్ యెడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పు గురించి తనకేమీ తెలియదన్న ఆయన మీరే చెప్పాలంటూ వీడియాతో అన్నారు. శుక్రవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన యెడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఆయనను మీడియా ప్రశ్నించగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని తాను కోరినట్లు చెప్పారు.
మరోవైపు సీఎం యెడియూరప్పపై కర్ణాటక బీజేపీలో అసమ్మతి పెరుగుతున్నది. ఆయనను మార్చాలంటూ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం యెడియూరప్ప శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.