మథుర: యూపీలోని మథుర నియోజకవర్గం నుంచి ఎంపీ హేమామాలిని(Hema Malini) మూడవ సారి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడి గోపికగా తనకు తానే భావించుకుంటానని ఆమె అన్నారు. పేరు ప్రఖ్యాతల కోసం తాను రాజకీయాల్లో చేరలేదని, భౌతిక లాభాల కోసం కూడా రాజకీయాలకు రాలేదన్నారు. నేను శ్రీకృష్ణుడి గోపికను అని ఆమె తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు బ్రిజ్వాసిలను ప్రేమిస్తారని, అయితే వాళ్లకు సేవ చేసే తనపై ఆ కృష్ణుడి కరుణ ఉంటుందని హేమామాలిని పేర్కొన్నారు. తాను బ్రిజ్వాసీలకు సేవ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. మథురలో ఉన్న బ్రిజ్వాసీలకు సేవ చేసే భాగ్యం కల్పించిన బీజేపీ అగ్రనేతలకు థ్యాంక్స్ తెలిపారు.
శ్రీకృష్ణుడిని ఆరాధించేవారిని బ్రిజ్వాసీలు అంటారు. అయితే బ్రజ్ 84 కోస్ పరిక్రమ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ హేమామాలిని వెల్లడించారు. పర్యాటకులను ఆకర్షించే రీతిలో దాన్ని రూపొందించనున్నట్లు ఆమె చెప్పారు. బ్రజ్ 84 కోస్ పరిక్రమ పునరుద్దరణ కోసం కేంద్ర రవాణాశాఖ మంత్రి సుమారు 5వేల కోట్ల నిధులను కేటాయించినట్లు ఆమె తెలిపారు. యమునా నది నీటిని ఢిల్లీ, హర్యానాలో శుద్ధి చేయకుంటే, మథుర ఆ నీటిని శుద్ధి చేయడం కుదరదని ఆమె అన్నారు.