Kamal Nath: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ నగరంలో మంగళవారం ఉదయం ఆయన స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లోక్సభ ఎన్నిల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీ హైకమాండ్ త్వరలోనే వెల్లడిస్తుందని చెప్పారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 నుంచి 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని కమల్నాథ్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమవుతుందని, సమావేశం అనంతరం రాష్ట్రంలో 15 నుంచి 20 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.