కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి విజయం సాధించారు. ఆమెపై పోటీపడిన బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రివాల్ ( Priyanka Tibrewal ) భారీ తేడాతో ఓడిపోయారు. అయితే, ఈ ఉప ఎన్నికల ఫలితాలపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. ఎన్నికల్లో గెలుపు మమతాబెనర్జిదే అయినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తానేనని చెప్పారు.
మమతాబెనర్జికి బలమైన మద్దతున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి తాను ఆమెపై పోటీచేశానని, అయినా తనకు 25 వేలకు పైగా ఓట్లు రావడం సాధారణ విషయం కాదని టిబ్రివాల్ వ్యాఖ్యానించారు. అందుకే ఈ ఎన్నికల్లో మమతాబెనర్జి గెలిచినా ఎన్నికల ప్రక్రియలో తానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచినట్లని చెప్పారు. పార్టీ కోసం తాను ఇకపై కూడా కష్టపడి పనిచేస్తానని టిబ్రివాల్ తెలిపారు.