గుల్మర్గ్ : జమ్ము కశ్మీర్లోని గుల్మార్గ్ గొండొలా కేబుల్ కార్ సర్వీస్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సాయంత్రం వరకు దాదాపు సగం మందిని సురక్షితంగా కిందకు దించారు.
ఆకాశంలో పలు క్యాబిన్లు నిలిచిపోవడంతో అందులోని పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించడం వల్లే సాంకేతిక సమస్య ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని.. భయపడాల్సిన పరిస్థితేమీ లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.