బెంగళూరు, డిసెంబర్ 7: మానవతావాది, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ దుబాయ్లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు (కాప్-28)లో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 8న సభ్య దేశాల అధినేతలను ఉద్దేశించి ‘ఆధ్యాత్మిక శాంతి, పర్యావరణం’ అన్న అంశంపై సదస్సులో ఆయన ప్రసంగిస్తారని యుఏఈ పర్యావరణ మంత్రి సుసానే మహ్మద్ తెలిపారు.
వారం రోజుల పర్యటన నిమిత్తం శ్రీశ్రీ రవిశంకర్ ఇప్పటికే దుబాయ్కు చేరుకున్నారు. తన పర్యటనలో తొలుత యుఏఈలో అతిపెద్ద నగరం ఫుజైరా పాలకుడు హమద్ బిన్ మహ్మద్ అల్ షర్కీతో సమావేశమై పలు అంశాలపై శ్రీశ్రీ రవిశంకర్ చర్చించనున్నారు. ఆ తర్వాత పర్యావరణం, శాంతియుత జీవనం తదితర విషయాలపై కాప్-28 సదస్సులో ప్రసంగిస్తారు. పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో శ్రీశ్రీ రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.