న్యూఢిల్లీ: కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ శుక్రవారం గంట సేపు పనిచేయని విషయం తెలిసిందే. కాపీరైట్ చట్టం కింద ట్విట్టర్ సంస్థ ఆయన ట్వీట్లను నిలిపివేసింది. అయితే మంత్రి రవిశంకర్ ఓ మ్యూజిక్ కంపెనీ సౌండ్ట్రాక్ను వాడడం వల్ల కాపీరైట్ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన మా తుజే సలామ్ పాట సౌండ్ట్రాక్ను ఓ క్లిప్ కోసం మంత్రి వాడినట్లు లుమెన్ డేటాబేస్ ద్వారా వెల్లడైంది. అయితే సోని మ్యూజిక్ సంస్థ ఆ కాపీరైట్ జారీ చేసింది. అమెరికాకు చెందిన డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ కింద ఆ ఉల్లంఘన జరిగినట్లు ట్విట్టర్ పేర్కొన్నది. ట్విట్టర్ సంస్థ భారతీయ ఐటీ చట్టాలను ఉల్లంఘించినట్లు మంత్రి ఆరోపించారు. దీంతో మళ్లీ మంత్రి అకౌంట్కు ట్విట్టర్ లాగిన్ అవకాశం కల్పించింది.