న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలు పెరిగాయి. శత్రు దేశాలకు చెందిన మిస్సైల్, డ్రోన్ దాడులు జరుగుతున్నట్లు కువైట్ ఆర్మీ(Kuwait Army) ఇవాళ ప్రకటించింది. అయితే ఆ దాడులను తమ వైమానిక రక్షణ దళం తిప్పికొడుతున్నట్లు కువైట్ ఆర్మీ తెలిపింది. దేశ ప్రజలు భద్రత పాటిస్తూ రక్షణాత్మక ఆదేశాలను అనుసరించాలని కువైట్ కోరింది. కువైట్ ఆర్మీ తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ ఓ పోస్టు చేసింది. తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు.. శత్రు దేశాలకు చెందిన మిస్సైళ్లు, డ్రోన్లతో ఫైట్ చేస్తున్నాయని తెలిపింది.. ఒకవేళ భారీ పేలుడు శబ్ధాలు వినిపిస్తే, అవి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు చెందిన దాడులుగా గుర్తించాలని కువైట్ ఆర్మీ తెలిపింది. ఇటీవల మే 28వ తేదీన కూడా గుర్తు తెలియని మిస్పైళ్లు, డ్రోన్లను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్నది.