అహ్మదాబాద్ : పెళ్లి ఊరేగింపులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. శోభాయాత్రలో వరుడి గుర్రపు బండి మంటల్లో చిక్కుకున్నది. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు పలువురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఓ యువకుడి పెళ్లి సందర్భంగా బంధువుల, స్నేహితుల నృత్యాల మధ్య శోభాయాత్రగా పెళ్లి మండపానికి గుర్రపు బగ్గీలో వెళ్తున్నాడు.
వరుడితో పాటు కొంతమంది చిన్నారులు సైతం కూర్చున్నారు. నృత్యాలు, పటాకులు కాలుస్తూ సందడి చేస్తూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా గుర్రపు బండిలో మంటలు చెలరేగింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై వరుడితో పాటు చిన్నారులను కాపాడారు. అలాగే బండి నుంచి గుర్రాలను సైతం విడదీసి, నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే, గుర్రపు బండిలో సైతం పటాకులు కొన్ని ఉంచగా.. వాటితోనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తున్నది.
A horse carriage caught fire during a wedding procession in #Gujarat's Panchmahal. The groom had a narrow escape but no one was injured in the incident. pic.twitter.com/vsryXvWYFD
— India.com (@indiacom) December 15, 2021