న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను (Lakhbir Singh Landa) కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా (Terrorist) ప్రకటించింది. ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు అనుబంధంగా లాండా పనిచేస్తున్నాడు. 2021లో మోహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్పై రాకెట్ దాడి ప్రణాళికలో లఖ్బీస్ సింగ్ పాలుపంచుకున్నాడు. అదేవిధంగా 2022లో టార్న్ తరణ్లోని సర్హాలి పోలీస్ స్టేషన్పై జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలో కూడా అతిని పాత్ర ఉన్నది.
పంజాబ్కు చెందిన 33 ఏండ్ల లఖ్బీర్ సింగ్ గత కొన్నేండ్లుగా కెనడాలో ఉంటున్నాడు. భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో పాల్పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో పంజాబ్లోని 48 ప్రాంతాల్లోని అతని సంబంధితుల ఇండ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Canada-based Babbar Khalsa’s Lakhbir Singh Landa declared a terrorist by Ministry of Home Affairs. pic.twitter.com/iz2eNhpxyt
— ANI (@ANI) December 30, 2023