లక్నో: సుమారు 65 ఏండ్ల కిందట కిడ్నాప్ అయిన మహిళ 80 ఏండ్ల వయసులో తిరిగి సొంతింటికి చేరుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. మిథానీ అనే 15 ఏండ్ల బాలిక హర్దోయిలో తండ్రి, సోదరునితో హర్దోయిలో ఉండేది. కొన్ని రోజుల్లో వివాహం జరిగి అత్తింటికి వెళ్లాల్సి ఉంది. అయితే 1961-62లో బల్దేవ్ అనే దోపిడీ దొంగ వారి ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో ఏమీ లభించక పోవడంతో ఆమెను అపహరించుకుపోయాడు. తర్వాత ఆమెను అమ్మేసేందుకు అలీగఢ్ తీసుకురాగా, సోహన్లాల్ యాదవ్ అనే మల్లయోధుడు ఆమెను రక్షించి పెండ్లి చేసుకున్నాడు. కుటుంబం కోసం తపించిన ఆమె పుట్టింటి చిరునామాను ఎట్టకేలకు చిన్న కూతురు సంపాదించి అక్కడికి తీసుకువెళ్లింది.