న్యూఢిల్లీ, ఆగస్టు 11: మోదీ భారతం అంటే తనకు ఇష్టం లేదని, ఎందుకంటే ఇది చాలా సంకుచితంగా, చాలా పరిమితంగా ఉన్నదని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆమె ‘ది వైర్’ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 1947లో స్వాతంత్య్ర సిద్ధించినప్పుడు తాము కలలుగన్న ఆశలను, ఆకాంక్షలను మోదీ భారతం ప్రతిబింబించడం లేదని పేర్కొన్నారు.
మోదీని చరిత్ర ఏవిధంగా గుర్తుంచుకుంటుందని ప్రశ్నించగా.. చరిత్ర ఆయనపై ఎట్టిపరిస్థితుల్లోనూ దయ చూపదని పేర్కొన్నారు. ‘మోదీ పెద్ద వ్యక్తే కావచ్చు.. కానీ చరిత్ర దృష్టిలో ఆయన గతం పగుళ్లతోనే లిఖించి ఉంటుంది’ అని తెలిపారు.