హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు కేంద్ర సమాచార కమిషనర్గా ఉన్న హీరాలాల్ సమారియా సోమవారం ప్రధాన సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 63 ఏండ్ల హీరాలాల్తో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన హీరాలాల్ సమారియా రాజస్థాన్లోని భరత్ పూర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు.
ఆయన సింగరేణి డైరెక్టర్గా, విద్యుత్తు రంగంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేశారు. 2020లో సమాచార కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్గా వైకే సిన్హా పదవీకాలం ముగిసిన తర్వాత అక్టోబర్ 3 నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, సీఐసీలో ప్రస్తుతం ఇద్దరు సమాచార కమిషనర్లు మాత్రమే ఉన్నారు. 8 మంది సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.