న్యూఢిల్లీ : బీహార్లో ఎన్డీయే పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ-17 స్థానాల్లో, నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 16 స్థానాల్లో, చిరాగ్ పాశ్వాన్కు చెందిన ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ-5 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్టు బీహార్ బీజేపీ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు చెరొక స్థానంలో పోటీ చేస్తాయని తెలిపింది.